కారు, లారీ ఢీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి

by Disha Web Desk 1 |
కారు, లారీ ఢీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి
X

దిశ, చౌటకూర్ : కారు, లారీ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన ఘటన చౌటకూర్ మండలం పరిధిలోని సరాఫ్ పల్లి గ్రామ శివారులో పీ.పీ.ఆర్ గార్డెన్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల షాపూర్ నగర్ కు చెందిన అరవిళ్ల నరసింహారావు (55) సైబరాబాద్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే, తన అల్లుడు కోనేటి గోవింద రాజుతో కలిసి తన వ్యక్తిగత పని నమిత్తం బాన్సువాడకు వెళ్లి తిరిగి వస్తున్నడు. ఈ క్రమంలో కారు చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి గ్రామ శివారులోని పీ.పీ.ఆర్ గార్డెన్ వద్దకు రాగానే ఎదురుగా రాగ్ రూట్ లో అతి వేగంగా వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందాడు.

తన వెంట ఉన్న గోవిందరాజు కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు కనకదుర్గ ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed