గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం..

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం..
X

దిశ, దుందిగల్: ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మే 29 సూరారం సాయిబాబా నగర్ బడా మజీద్ దగ్గర ఓ మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో పెట్రోలింగ్ మొబైల్ ఇంచార్జీ కిష్టయ్య సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మహిళ విగతజీవిగా ఉండాన్ని గమనించిన పోలీసులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. పరిశీలించిన వైద్యులు మహిళ అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.

పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. గత కొంత కాలంగా సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మహిళకు మద్యం సేవించడం అలవాటు ఉన్నట్లు సమచారం. మద్యం మత్తులో మండుటెండలో తిరగడం వలన సన్ స్ట్రోక్ తగిలి మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళకు సుమారు 45 నుండి 50 సంవత్సరాలు ఉండవచ్చునని గుర్తించిన వారు 9985565772 కు సమాచారం అందించాలన్నారు.


Next Story

Most Viewed