బీజేపీ నేత కొడుకు వీరంగం.. టోల్ ఫీ కట్టమన్నందుకు ఉద్యోగిపై దాడి

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:39:33  IST  )

కర్ణాటక బీజేపీ నేత విజయ గౌడ పాటిల్ కొడుకు సమర్త గౌడ పాటిల్ వీరంగం సృష్టించాడు. విజయపూర-సిందగి రహదారిపై ఉన్న ఒడకి టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు అడగడంతో ఉద్యోగిపై దాడి చేశాడు. టోల్ ఫీ రూ. 50 చెల్లించమని

బీజేపీ నేత కొడుకు వీరంగం.. టోల్ ఫీ కట్టమన్నందుకు ఉద్యోగిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బీజేపీ నేత విజయ గౌడ పాటిల్ కొడుకు సమర్త గౌడ పాటిల్ వీరంగం సృష్టించాడు. విజయపూర-సిందగి రహదారిపై ఉన్న ఒడకి టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు అడగడంతో ఉద్యోగిపై దాడి చేశాడు. టోల్ ఫీ రూ. 50 చెల్లించమని ఉద్యోగి అడగ్గా.. నేను విజు గౌడ్ పాటిల్ కొడుకుని చెప్పాడు. ఆయనెవరో తెలియదని ఉద్యోగి చెప్పగానే.. నా తండ్రి ఎవరో తెలియదా? అంటూ దాడికి దిగాడు. ముగ్గురితో కలిసి ఉద్యోగిని చుట్టుముట్టి దారుణంగా కొట్టారు. తోటి ఉద్యోగులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. ఘటనలో బాధితుడు సంగప్పకు గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story