కోడలిపై అత్త పైశాచికత్వం.. రుతుక్రమ రక్తాన్ని మంత్రగాడికి అమ్మి

by Disha Web Desk 6 |
కోడలిపై అత్త పైశాచికత్వం.. రుతుక్రమ రక్తాన్ని మంత్రగాడికి అమ్మి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం వివాహితపై అత్తింటి వారు వారికి నచ్చినట్టుగా ఉండక పోతే దారుణాలకు పాల్పడుతున్నారు. కొంత మంది కట్నం కోసం కోడలిని వేదిస్తే మరికొంత మంది ఇతర కారణాలతో కోడలిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా డబ్బులకు ఆశపడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. సమాజంలో మహిళలు ఏదో ఒక విధంగా వేధింపులకు గురవుతున్నారు. తాజాగా, మహారాష్ట్ర లోని సౌందనా గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 50 వేల కోసం ఓ వివాహితపై అత్తమామలు ఆమె రుతుస్రావం రక్తాన్ని మంత్రగాడికి అమ్మేశారు.

వివరాల ప్రకారం.. పూణేకు చెందిన 27 ఏళ్ల యువతి రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో అత్తింటి వారితో కలిసి సౌందనా గ్రామంలో నివసిస్తుంది. అయితే ఆమె అంటే నచ్చని అత్తమామలు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. వివాహిత భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో అత్త,మామ ఆమె కాళ్లు చేతులు కట్టేశారు. ఆ తర్వాత రుతుస్రావం రక్తాన్ని దూదితో సీసాలో సేకరించి ఓ మంత్రగాడికి రూ. 50 వేలకు అమ్మేశారు. ఈ దారుణాన్ని భరించలేని మహిళ పుట్టింటికి చేరుకుని జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో విషయం బయటపడింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story