ఆవులను దొంగిలేందుకు యత్నం.. హిందూ వాహిని సభ్యుల అప్రమత్తతో దొంగలు పరార్

by Disha Web Desk 1 |
ఆవులను దొంగిలేందుకు యత్నం.. హిందూ వాహిని సభ్యుల అప్రమత్తతో దొంగలు పరార్
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు పశువులు దొంగిలించేందుకు యత్నించారు. రెండు ఆవులను మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. హిందూ వాహిని సభ్యుల అప్రమత్తతతో దొంగలు పరారయ్యారు. కారులో ఉన్న ఒక ఆవుతో పాటు మత్తు మందు ఇచ్చిన మరో ఆవును వారు రక్షించారు. అదేవిధంగా వచ్చిన అగంతకులు కారు, సెల్ఫోన్, పశువులను ఘటనా స్థలంలోనే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై హిందూ వాహిని సభ్యులు స్థానిక మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు హిందూ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ దాత్రిక రమేష్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఆవులను దొంగిలించేందుకు వచ్చిన వ్యక్తి మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన షోయబ్ పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story

Most Viewed