- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ లో దారుణం..యువకుడిని నరికి చంపిన దుండగులు
by velandi.Saikiran |
సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దుండగులు నరికి చంపారు.

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువకుడిని ఏకంగా ఆరుగురు దుండగులు నరికి చంపారు. బైక్ లపై వచ్చి యువకుడిని వెంటాడి మరి నిందితులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన జరగగానే ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.
అయితే, ఆరుగురు దుండగులు చంపి.. పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అప్పటికే ఆ యువకుడు మరణించాడని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






