Crime News : నగ్నంగా బాలికను 2 కి.మీ. నడిపించిన కామాంధులు.. ఆపై నలుగురు కలిసి అత్యాచారం

by Disha Web Desk 6 |
Crime News : నగ్నంగా బాలికను 2 కి.మీ. నడిపించిన కామాంధులు.. ఆపై నలుగురు కలిసి అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: గుడి, బడి అనే తేడా ఏం లేదు. ఎక్కడ ఉన్నా అతివలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ సేప్‌గా తిరిగి వచ్చే పరిస్థితి లేదు నేటి రోజుల్లో.. తాజాగా ఓ బాలిక జాతరకు వెళ్లి వస్తుండగా నలుగురి చేతిలో దారుణంగా అత్యాచారానికి గురింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. జాతీయ మీడియా కథనం ప్రకారం..

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలో 15 ఏళ్ల బాలిక సెప్టెంబరు 1న పక్క గ్రామంలో జరిగే జాతరకు హాజరయ్యేందుకు వెళ్లింది. జాతర ముగిశాక పొరుగు గ్రామం నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బట్టలు లేకుండా ఇంటికి వెళ్లాలని బెదిరించారు. ఏమి చేయలేని పరిస్థితిలో వారు చెప్పినట్టు చేసింది. సుమారు 2 కిలోమీటర్ల దూరం నగ్నంగా నడుచుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన సంఘటన ఘటన గురించి బాలిక తన మేనమామకు చెప్పుకుంది. దీంతో బాధితురాలి మామ తన మేనకోడలుపై అత్యాచారం చేసినందుకు భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్టు సమాచారం.

శృంగారంలో మునిగిన అక్కా తమ్ముడు.. తల్లి చూడటంతో ఇద్దరు కలిసి.


Next Story

Most Viewed