పేకాటరాయుళ్ల అరెస్టు

by Disha Web Desk 1 |
పేకాటరాయుళ్ల అరెస్టు
X

దిశ, తాడ్వాయి :పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న ఘటన తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో శనివారం తెల్లవారు జామున ముసుకు సంగారెడ్డి, బొంది లింగం, మరాఠీ కిష్టయ్య, మరాటి నారాయణ పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడితో నిందితుల నుంచి నుంచి 52 పేక ముక్కలు, రూ.6,720 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏస్ఐ ఆంజనేయులు తెలిపారు.

Next Story

Most Viewed