అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

by Disha Web Desk 11 |
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..
X

దిశ, ఊట్కూర్: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని చెక్ పోస్ట్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. సమిస్తాపూర్ చెక్ పోస్ట్ వద్ద వరి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీలలో భాగంగా ఓ వ్యక్తి 24 బీర్లు, మూడు ఐబీ మద్యం సీసాలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

కర్ణాటక ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం, డబ్బు, చీరలు, వెళ్లే అవకాశం ఉందని మరింత పకడ్బందీగా ఉండాలని చెక్ పోస్ట్ పోలీసులకు ఎస్సై సూచించారు. అనంతరం మద్యాన్ని పోలీసులు ఎక్సెస్ శాఖకు అప్పగించారు. అక్రమ మద్యం రవాణా చేసే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ హెచ్చరించారు.

Next Story

Most Viewed