బస్సు ప్రమాదం మరువకముందే మరో షాకింగ్ ఘటన.. కాలిబూడిదైన కారు

by Gantepaka Srikanth |

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

బస్సు ప్రమాదం మరువకముందే మరో షాకింగ్ ఘటన.. కాలిబూడిదైన కారు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. అయితే.. ఈ ఘటన మరువకముందే మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR)పై పెను ప్రమాదం తప్పింది. ముత్తంగి నుంచి కొల్లూరు వైపు వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అందులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పొగలు రావడాన్ని గుర్తించి వారంతా కారు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో

Next Story