ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో అనూహ్య ట్విస్ట్.. తండ్రికి ఫోన్ చేసిన వైశాలి

by Disha Web Desk 19 |
ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో అనూహ్య ట్విస్ట్.. తండ్రికి ఫోన్ చేసిన వైశాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొంది. కిడ్నాప్‌కు గురైన డాక్టర్ వైశాలి తన తండ్రి దామోదర్‌కు ఫోన్ చేసింది. తాను సిటీలోనే సేఫ్‌గానే ఉన్నానని తండ్రికి ఫోన్‌లో తెలిపింది. తన గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించింది. వెంటనే యువతి తండ్రి దామోదర్, పోలీసులు కలిసి యువతి ఉన్న ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసి.. డాక్టర్ వైశాలిని రక్షించిన పోలీసులు.. కిడ్నాప్ కేసును గంటల్లోనే ఛేదించారు. నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇవాళ మధ్యాహ్నం నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మంది రౌడీలతో వచ్చి తన కూతురు వైశాలిని కిడ్నాప్ చేశాడని యువతి తండ్రి దామోదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు.


Next Story

Most Viewed