వృద్ధురాలిని హతమార్చి.. మృతదేహంపై అత్యాచారం..

by Disha Web Desk 9 |
వృద్ధురాలిని హతమార్చి..  మృతదేహంపై అత్యాచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధ మహిళను హత్య చేసి.. అనంతరం ఆమెపై ఆత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని అర్సికెరె తాలూకా ఎరెహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 1వ తేదీన ఓ వృద్ధురాలు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలం వద్దకు న‌డుచుకుంటూ వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు చీకటి కావడంతో ఆమె దారిని గుర్తించలేకపోయింది. అదే ప్రాంతానికి చెందిన మిథున్ కుమార్ (32) బైక్‌పై వచ్చి ఆ మహిళను ఇంటి దగ్గర దింపుతానని నమ్మించి.. బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఆమెను ఇంటికి బదులు సమీపంలోని పొలానికి తీసుకెళ్లాడు.

తర్వాత ఆ కిరాతకుడు ఆమెపై అత్యాచారానికి సిద్ధపడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమె తలపై రాయితో కొట్టి చంపాడు. ఆమె మరణించిన అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు కనిపించకపోవడంతో ఏప్రిల్ 2న తమ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గ్రామమంతా వెతకగా.. పొలం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో తల పగిలి ఉన్న స్థితిలో నగ్న మృతదేహం లభ్యమయ్యింది. తర్వాత నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అతడిపై ఐపీసీ 376(అత్యాచారం), 302 (హత్య) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. నిందితుడు ఇంతకుముందు ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తు్న్నామని అర్సికెరె రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ‘రాఘవేంద్ర ప్రకాశ్’’ తెలిపారు.



Next Story

Most Viewed