చెరువులో ప‌డి వృద్ధుడు మృతి

by Ratna Kumari |

దిశ‌, బిజినేప‌ల్లి : ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శాయిన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది

చెరువులో ప‌డి వృద్ధుడు మృతి
X

దిశ‌, బిజినేప‌ల్లి : ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శాయిన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయిన్ పల్లి గ్రామానికి చెందిన పెద్ద కొండయ్య (70) అనే వృద్ధుడు మమ్మాయిపల్లి గ్రామ శివారులో గల మార్కండేయ చెరువులో ప్రమాదవశత్తు పడి మృతి చెందాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి కనపడకపోవడంతో బంధువుల కు ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో చివరకు మార్కండేయ చెరువులో మృతుడై కనిపించడంతో కుటుంబీకులు బోరుణ విలపించారు. మృతునికి భార్య వెంకటమ్మతో పాటు నలుగురు సంతానం ఉన్నారు.

Next Story