పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి వృద్ధుడి మృతి

by Disha Web Desk 1 |
పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి వృద్ధుడి మృతి
X

దిశ, పెద్దపల్లి : సుల్తానాబాద్ పట్టణ పరిధిలో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎలవేణి రాజయ్య అనే వృద్ధుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు వృద్ధుడిని చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజయ్య ఎక్కవ మొత్తంలో పురుగల మందు సేవించడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు కొల్పోయాడు. సుల్తానాబాద్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అక్కడే ఉంచారు. మృతుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.


Next Story