టెన్త్ విద్యార్థుల ఆటో బోల్తా.. ఒకరు మృతి

by Javid Pasha |

పదో తరగతి పరీక్ష అనంతరం విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో ప్రమదవశాత్తు బోల్తా పడింది.

టెన్త్ విద్యార్థుల ఆటో బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి పరీక్ష అనంతరం విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో ప్రమదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో గోపాల్పల్లికి చెందిన శిరీష అనే విద్యార్థిని మృతి చెందింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 8మంది విద్యార్థులు ఉండగా.. పలువురిగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా విద్యార్థి మృతితో గాపోల్ పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story