18 నెలల పసికందు మృతికి కారణం అదే..

by Disha Web Desk 20 |
18 నెలల పసికందు మృతికి కారణం అదే..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండల కేంద్రంలో సుభాష్ గల్లిలో ఓ నీటి కుండిలో పడి నడుకుడ యశ్వంత్ (18 నెలల) పసికందు ఆదివారం మృతి చెందాడు. రెండు, మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు నందిపేట్ లోని సుభాష్ గల్లీలో గల నీటి కుండీలు నిండుకున్నాయి.

కాగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్న మున్నూరుకాపు కులానికి చెందిన నడుకుడ శ్రీనివాస్ - నడుకుడ మమత దంపతుల (18 నెలల) పసికందు నడుకుడ యశ్వంత్ నీటి కుండీలో పడి మృతిచెందాడు. చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ వెలుతూ ఇంటి బయట పరిసరాల్లో గల నీటి కుండీలో పడిపోయాడు. 18 నెలల వయసున్న చిన్నారి అకాల వర్షానికి నిండిన నీటి కుండీలో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. ఆ దంపతులకు మూడేళ్ల వయసు గల పెద్ద కుమారుడు ఉన్నాడు.

Next Story

Most Viewed