ఏసీబీకి చిక్కిన బోడుప్పల్ విద్యుత్ శాఖ ఏఈ ప్రసాద్ బాబు..

by Disha Web Desk 11 |
ఏసీబీకి చిక్కిన బోడుప్పల్ విద్యుత్ శాఖ ఏఈ ప్రసాద్ బాబు..
X

దిశ, మేడిపల్లి: విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి చిక్కిన సంఘటన బోడుప్పల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ గా పని చేస్తున్న నవీన్ తనను ప్రతి కాంట్రాక్ట్ పనికి పైసలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసేవారని ఇప్పటికి అనేకమార్లు డబ్బు ఇచ్చానని, అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ కి సంబంధించిన బిల్లు విషయమై సంప్రదించగా పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పాడు.

అంత మొత్తంలో ఇచ్చుకోలేక ఏసీబీ వాళ్లని సంప్రదించగా వారి సూచనల ప్రకారం మంగళవారం ఉదయం ఏఈ కార్యాలయంలో ప్రసాద్ బాబుకి డబ్బు ఇస్తుండగా ఏసీబీ వాళ్లు వచ్చి పట్టుకున్నారని బాధితుడు నవీన్ తెలిపాడు. ఈ సందర్భంగా ఏఈ ప్రసాద్ బాబు ఇంటి వద్ద మల్కాజిగిరి లో కూడా ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.







Next Story

Most Viewed