క్లాస్ రూంలోనే అబార్షన్.. యువతి మృతితో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

by Disha Web Desk 7 |
క్లాస్ రూంలోనే అబార్షన్.. యువతి మృతితో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 11 న విద్యార్థులు అందరూ బయటున్న క్రమంలో.. ఆ యువతి క్లాస్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికి ఆమె రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి చూశారు. తరగతి గదిలోనే ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో అపాస్మారక స్థితిలో పడి ఉంది. అనంతరం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మృతి చెందింది. అయితే ఈ కేసును నెల్లూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బీటెక్ చదువుతున్న ఆ యువతికి కారు డ్రైవర్‌ శశి అనే వ్యక్తితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చిందని, పరువు పోతుందన్న భయంతో యువతి గర్భస్రావానికి ప్రయత్నించి చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడిని శిక్షించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed