వేంపల్లెలో యువకుడు దారుణ హత్య

by Dishafeatures2 |
వేంపల్లెలో యువకుడు దారుణ హత్య
X

దిశ,కడప: వైయస్సార్ జిల్లా మండలం కేంద్రమైన వేంపల్లెలో తమ్మిశెట్టి విజయ్ కుమార్ (20) అనే యువకుడు సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే వేంపల్లె పట్టణం ప్రియాతోటకు చెందిన టి. రాము, లక్ష్మి దేవి ల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు టి. వినయ్ కుమార్, చిన్న కుమారుడు టి. విజయ్ కుమార్. హత్యకు గురైన టి. విజయ్ కుమార్ కు గత 7 మాసాల కిందట అలిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి ప్రసన్నతో వివాహం జరిగింది.

వృత్తి రీత్యా ఫ్లోరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్న టి. విజయ్ కుమార్ మంగళవారం తెల్లవారుజామున పాములూరు గుట్ట సమీపంలోని నాగల కట్ట వద్ద హత్యకు గురయ్యాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా వేంపల్లె సీఐ జీ. వెంకటేశ్వర్లు మరియు ఎస్సై తిరుపాల్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరాతీసారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, బాడీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, తండ్రి టి. రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed