బారసాలకు పిలవలేదని యువకుడి హత్య..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ షహజాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బారసాలకు పిలవలేదని పిల్లాడి తండ్రిని చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. తిల్హర్ పీఎస్ పరిధిలో నివసించే 24 ఏళ్ల అవినాష్ తన కొడుకు బారసాలను ఘనంగా జరిపాడు. అయితే

బారసాలకు పిలవలేదని యువకుడి హత్య..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ షహజాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బారసాలకు పిలవలేదని పిల్లాడి తండ్రిని చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. తిల్హర్ పీఎస్ పరిధిలో నివసించే 24 ఏళ్ల అవినాష్ తన కొడుకు బారసాలను ఘనంగా జరిపాడు. అయితే ఈ కార్యక్రమానికి ఊరి పెద్ద మనిషి సుఖ్‌దేవ్‌ను పిలవకపోవడంతో హర్ట్ అయ్యాడు. గొడవకు దిగిన అతను.. అవినాష్‌ను కాల్చి చంపేశాడు. అడొచ్చిన మహిళలపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ గ్రామస్తులు అతన్ని పట్టుకుని కొట్టి.. పోలీసులకు అప్పగించారు. చనిపోయిన అవినాష్ తండ్రి సుఖ్‌దేవ్‌తోపాటు ఆయన ఇద్దరు కొడుకులు ధీరేంద్ర, ధర్మేంద్రపై కూడా కేసు పెట్టాడు. దీంతో విచారిస్తున్నారు పోలీసులు.

Next Story