మహమ్మద్ నగర్ తండాలో నీట మునిగి యువకుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

ఇంటి నుంచి మూడు రోజులక్రితం వెళ్లి అదృశ్యమైన ఓయువకుడు చెరువులో తేలి మృతి చెందిన సంఘటన వెల్దుర్తి మండలంలోని మహమ్మద్ నగర్ తండా లో శుక్రవారం చోటు చేసుకుంది.

మహమ్మద్ నగర్ తండాలో నీట మునిగి యువకుడు మృతి
X

దిశ, వెల్దుర్తి : ఇంటి నుంచి మూడు రోజులక్రితం వెళ్లి అదృశ్యమైన ఓయువకుడు చెరువులో తేలి మృతి చెందిన సంఘటన వెల్దుర్తి మండలంలోని మహమ్మద్ నగర్ తండా లో శుక్రవారం చోటు చేసుకుంది. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలంలోని మహమ్మద్ నగర్ తండా కు చెందిన రమావత్ గోపాల్ 38 గ్రామ శివారులోని చెరువులో గత మూడు రోజుల క్రితం చేపలు పట్టడానికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో గురువారం ఉదయం చెరువుగట్టు వద్ద గోపాల్ బట్టలు ఇతర వస్తువులు లభించడంతో శుక్రవారం గజ ఈత గాళ్ల‌తో చెరువులో వెతకగా గోపాల్ మృతదేహం లభించింది. మృతుని కుమారుడు రామావత్ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story