చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..

by Disha Web Desk 20 |
చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
X

దిశ, గూడూరు : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తలిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామంలో జరిగింది. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం ఎపూరు గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్ (30) అనే వ్యక్తి స్నేహితునితో కలిసి పాకాల వాగులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ప్రవీణ్ వాగులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed