- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేపల వేటకు వెళ్లి ఒక యువకుడి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, పాపన్నపేట : చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండల పరిధిలోని కందిపల్లిలో గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టి ఎల్లయ్య (25) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మంగళవారం ఉదయం మిత్రులతో కలిసి కందిపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి.. చేపలు పట్టి అటువైపు నుంచి ఈవోలు ఒడ్డుకు ఊదుతూ వస్తున్న క్రమంలో చెరువు మధ్యలోకి రాగానే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గమనించిన తోటి మిత్రులు ఎల్లయ్యను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పాపన్నపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story