వరికోత మిషన్ లో పడి యువకుడి మృతి

by Disha Web Desk 1 |
వరికోత మిషన్ లో పడి యువకుడి మృతి
X

దిశ గొల్లపల్లి : వరికోత మిషన్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అబ్బపూర్ కు చెందిన చెవుల రంజిత్ తమ పొలంలో వరి కోయించే పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతను ప్రమాదవశాత్తు వరికొత మిషన్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రంజిత్ తండ్రి గమనించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రంజిత్ మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. తండ్రి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story