గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి..

by Disha Web Desk 20 |
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి..
X

దిశ, చేగుంట : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన పల్లపు వెంకటేష్ (36) స్థానికంగా ఉండే వారి వద్ద రౌతు పనులు చేస్తూ ఉంటాడు.

బుధవారం రాత్రి పని ముగించుకొని గ్రామానికి వస్తుండగా బాలాజీ కంకర్ మిషన్ సమీపంలో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని శవానికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.



Next Story

Most Viewed