భార్యతో గొడవ.. మద్యం మత్తులో భర్త చేసిన పని ఇదే! (వీడియో)

by Disha Web Desk 2 |
భార్యతో గొడవ.. మద్యం మత్తులో భర్త చేసిన పని ఇదే! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఫ్లైఓవర్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన బాలానగర్‌లో వెలుగుచూసింది. ఎస్.ఆర్​. నగర్​లోని బాపునగర్​కు చెందిన భూక్యా అశోక్​(36) వెల్డింగ్ పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. అతని మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. కొంతకాలం తర్వాత రుక్సానా బేగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రోజు తాగొచ్చి భార్యను వేధిస్తూ.. చనిపోతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకే మద్యం తాగుడు మొదలుపెట్టిన అశోక్.. భార్య రుక్సానా బేగంతో గొడవకు దిగాడు.

అనంతరం రుక్సానా బేగంను చితకబాదాడు. తర్వాత చనిపోతానని చెప్పి మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాలానగర్​ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్​ను గాంధీకి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో అశోక్ సూసైడ్ చేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed