మహిళపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం!

by Dishafeatures2 |
మహిళపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం!
X

దిశ, నిజామాబాద్ క్రైం: నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పిక్చర్ పాలెస్ నుండి కసాబ్ గల్లి ప్రాంతంలో జ్యోతి అనే మహిళపై కత్తితో దాడి జరిగింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం ప్రాంతంలో జరిగినట్టు తెలిసింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళపై కత్తితో దాడి చేసిన అగంతకుడు పరారీ కాగా పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన జ్యోతిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నుంచి జ్యోతి బతుకుతెరువు కోసం నిజామాబాద్ నగరానికి వలస వచ్చి అడ్డ మీద కూలీగా పని చేస్తోంది.

ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన రాహుల్ అనే యువకుడికి ఆమెతో పరిచయం అయినట్లు తెలుస్తోంది. ఇక వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఆదివారం ఉదయం జ్యోతి ఉంటున్న ప్రాంతానికి సదరు యువకుడు వచ్చాడు. మహిళపై కత్తితో రాహుల్ దాడి చేశాడు. గొంతుపై మూడు సార్లు, తల భాగంలో పొడిచి పరారీ అయ్యాడు. స్థానిక ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. జ్యోతి పై జరిగిన దాడికి కారణాలు తెలియ రాలేదు.

Next Story

Most Viewed