భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి..

by Disha Web Desk 11 |
భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి..
X

దిశ, శంషాబాద్: నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి కింద పడి కార్మికుడు మృతి చెందిన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి భార్య సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. ‘నా భర్త సున్నాల రమేష్ (36), మేస్త్రి కుమార్ వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం కూడా శంషాబాద్ లోని శ్రీనివాస కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న 4వ అంతస్తు పైన సెంట్రింగ్ పని చేస్తుండగా కిందపడి తీవ్ర గాయాలైనాయి. ఈ విషయం మేస్త్రి కుమార్ ఫోన్ చేసి చెప్పడంతో షాద్ నగర్ నుంచి వచ్చి చూసేసరికి తలకు తీవ్ర గాయాలై అప్పటికే మృతి చెందాడు.

బిల్డింగ్ యాజమాని నీలం రాజు, కన్స్ట్రక్షన్ మేస్త్రి వెంకటేశ్వర్లు, సెంట్రింగ్ మేస్త్రి కుమార్ నూతనంగా నిర్వహిస్తున్న భవనం పై పని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేయడం వల్ల నా భర్త సున్నాల రమేష్ మృతి చెందాడు. వారి ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి’ అని చెప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, కన్స్ట్రక్షన్ మేస్త్రి వెంకటేశ్వర్లు సెంట్రింగ్ మేస్త్రి కుమాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story

Most Viewed