దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను సజీవదహనం చేసిన భార్య

by Disha Web Desk 19 |
దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను సజీవదహనం చేసిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: జిమ్ ట్రైనర్ జయకృష్ణ సజీవదహనం కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడితో కలిసి భార్యే జయకృష్ణను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్ పల్లికి చెందిన జిమ్ ట్రైనర్ జయకృష్ణ వారం రోజులు క్రితం ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో సజీవదహనమయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయకృష్ణ భార్యపై అనుమానం రావడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. చిన్నా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న దుర్గ.. ప్రియుడితో కలిసి భర్త జయకృష్ణను హత్య చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దుర్గ, ఆమె ప్రియుడు చిన్నాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ రిమాండ్‌కు తరలించారు.


Next Story