బైకు ఢీ కొట్ట‌డంతో మ‌హిళా మృతి

by Nallavelli.Anjaneyulu |

బైకు ఢీ కొట్ట‌డంతో మ‌హిళా మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

బైకు ఢీ కొట్ట‌డంతో మ‌హిళా మృతి
X

దిశ, బచ్చన్నపేట : బైకు ఢీ కొట్ట‌డంతో మ‌హిళా మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బ‌చ్చ‌న్న‌పేట మండ‌లంలోని ఆలింపూర్ గ్రామానికి చెందిన పాకాల ప‌ద్మ‌, న‌ర్స‌య్య దంప‌తులు. అయితే ప‌ద్మ రోడ్డు దాటుతుండ‌గా.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండ‌లం చిట్యాల గ్రామానికి చెందిన తమ్మునూరి విష్ణు ద్విచ‌క్ర వాహ‌నం వ‌చ్చి ఢీ కొట్టింది. దీంతో మ‌హిళా అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. మృతురాలు భ‌ర్త న‌ర్స‌య్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఎస్సై హ‌మీద్ కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ప‌ద్మ‌కు ముగ్గురు కుమార్తెలుండ‌గా.. వారి ముగ్గురికి వివాహం జ‌రిగింది.

Next Story