ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన దుండగుడు

by Disha Web Desk 1 |
ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన దుండగుడు
X

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

దిశ, అమీన్ పూర్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి కాలనీ వాసులకు చెందిన ఇంటి ఎదుట పార్క్ చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక ఇన్నోవా కారును దగ్ధం చేసిన రామచంద్రాపురం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. జరిగిన నష్టానికి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు.


Next Story

Most Viewed