- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎదురెదురుగా ఢీకొన్న గూడ్స్ రైళ్ళు.. లోకో పైలట్ మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం శాహ్డోల్ జిల్లాలోని సింగ్పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లోకో పైలట్ మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6.45 గంటల సమయంలో సింగ్పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఆగింది. అదే సమయంలో అదే ట్రాక్లో వచ్చిన మరో గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. ఒక రైలు భోగీలు, మరో రైలుపై పడగా.. ట్రాక్ మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో లోకో పైలట్ రాజేశ్ ప్రసాద్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న వైద్య కళాశాలలో చేర్పించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.