ఎదురెదురుగా ఢీకొన్న గూడ్స్ రైళ్ళు.. లోకో పైలట్ మృతి

by Dishafeatures2 |
ఎదురెదురుగా ఢీకొన్న గూడ్స్ రైళ్ళు.. లోకో పైలట్ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్​ ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం శాహ్​డోల్​ జిల్లాలోని సింగ్​పుర్​ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లోకో పైలట్​ మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6.45 గంటల సమయంలో సింగ్​పుర్​ రైల్వే స్టేషన్​ సమీపంలో ఓ గూడ్స్​ రైలు ఆగింది. అదే సమయంలో అదే ట్రాక్​లో వచ్చిన మరో గూడ్స్​ ట్రైన్​ ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. ఒక రైలు భోగీలు, మరో రైలు​పై పడగా.. ట్రాక్​ మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో లోకో పైలట్ రాజేశ్​ ప్రసాద్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న వైద్య కళాశాలలో చేర్పించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed