పిడుగు పడి వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
పిడుగు పడి వ్యక్తి మృతి..
X

దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో గురువారం పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... అంబటి పల్లి గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య (58) తన పొలంలో ఆవులు మేపుతుండగా కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో గాలి, వర్షం రావడంతో పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళుతున్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య బాలపీరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Next Story

Most Viewed