టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, మెదక్ టౌన్ : టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ పట్టణ పరిధిలోని బంగ్లా చెరువు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ మండలం మక్త భూపతిపూర్ కు చెందిన కుమ్మరి పోశాద్రి (62) నిత్యవసర సరుకుల నిమిత్తం పట్టణానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో భూపతిపూర్ నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ పోశాద్రి ద్విచక్ర వాహనాన్ని బంగ్లా చెరువు కట్టపై బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోశాద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed