- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, జగన్కు తానెంత చెబితే అంత అంటూ ఓ వ్యక్తి భారీ మోసం
by GSrikanth |
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పేర్లు వాడుకుంటూ ఓ కేటుగాడు అమాయకుల వద్ద ఏకంగా కోటిన్నర కొట్టేశాడు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు

X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పేర్లు వాడుకుంటూ ఓ కేటుగాడు అమాయకుల వద్ద ఏకంగా కోటిన్నర కొట్టేశాడు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు తనకు చాలా క్లోజ్ అంటూ మోసాలకు పాల్పడ్డాడు. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్కు తాను ఎంత చెబితే అంత అంటూ పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ అమాయకులను లక్ష్యంగా చేసుకొని భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. విడతల వారీగా ఓ వ్యక్తి వద్ద ఏకంగా రూ.కోటిన్నర వసూలు చేసినట్లు తెలుస్తోంది. చివరకు మోసపోయానని భావించిన బాధితుడు హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






