విషాదం: కుటుంబ కలహాలతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 19 |
విషాదం: కుటుంబ కలహాలతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మల్హర్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మల్హర్ మండలం తాడిచెర్లలో సోమవారం చోటుచేసుకుంది. కొయ్యూరు పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తిప్పని ప్రవీణ్ కుమార్(32) మానేరు నది ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తాడిచెర్ల కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

మద్యానికి బానిసైన ప్రవీణ్ కుమార్ తరచూ గొడవలు సృష్టించేవాడని భార్య రజిత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనికి వెళ్తున్నానని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రవీణ్ కుమార్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి మృతి చెందడంతో ఇద్దరు పిల్లల రోదనలు చుట్టుపక్కనున్న వారందరిని కన్నీళ్లు పెట్టించాయి.


Next Story

Most Viewed