లవర్‌తో ఫోన్ మాట్లాడుతుందని కూతురిని గొడ్డలితో నరికిన తల్లి

by Disha Web Desk 6 |
లవర్‌తో ఫోన్ మాట్లాడుతుందని కూతురిని గొడ్డలితో నరికిన తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది పరువు కోసం కన్న బిడ్డల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు వార్తల్లో చాలానే చూస్తున్నాం. తాజాగా, రాజస్థాన్‌లోని అజ్మేర్ ప్రాతంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లవర్‌తో ఫోన్ మాట్లాడుతుందని ఓ కసాయి తల్లి కన్న కూతురినే కడతేర్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మేర్‌లో శాంతి బేగర్ అనే మహిళ భర్త మృతి చెందడంతో తన కూతురు సోను, కుమారుడు హనీఫ్‌తో కలిసి జీవనం కొనసాగిస్తోంది. అయితే సోనూ ఓ యువకుడితో ప్రేమించింది. రోజూ ఫోన్ మాట్లాడుతుండగా సోనూ తల్లి గమనించింది. దీంతో పరువు పోతుందని భావించి కొడుకుతో కలిసి కూతురిని గొడ్డలితో నరికి చంపేసింది. ఆ తర్వాత కూతురు మృత దేహాన్ని మణిపూర్ అటవి ప్రాంతంలో ఉన్న బావిలో పడేసింది. అయితే సోనూ మృతదేహం బావిలో తేలడంతో ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాడీని పోస్ట్‌మార్టంకు తరలించి కుటుంబ సభ్యులను విచారించారు. విచారణలో తల్లి, కొడుకు వేర్వేరు సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని గట్టిగా మందలించగా తామే హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు వెంటనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story

Most Viewed