పుకార్ల నేపథ్యంలో మైనర్ బాలిక అత్మహత్య

by Disha Web Desk 1 |
పుకార్ల నేపథ్యంలో మైనర్ బాలిక అత్మహత్య
X

దిశ, నిజామాబాద్ క్రైం : పుకార్ల నేపథ్యంలో ఓ మైనర్ బాలిక అత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్స్ కాలనీకి చెందిన, ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఈ నెల 8న సాయంత్రం సమయంలో తెలిసిన ఓ మైనర్ బాలుడి బైక్ పై వెళ్లింది. అది చూసిన మరో మైనర్ బాలుడు విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో సదరు బాలికను తల్లిదండ్రు మందలించారు. అంతే కాకుండా అబ్బాయితో బైక్ పై వెళ్లిన విషయం కాలనీలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఇంట్లో శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ ఆరో టౌన్ ఎస్ఐ సాయి కుమార్ గౌడ్ తెలిపారు.



Next Story

Most Viewed