- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రాణం తీసిన అతివేగం.. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి..
దిశ, బొంరాస్ పేట్ : అతివేగం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. బొంరాస్ పేట్ ఎస్సై నయీమోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా, కోడంగల్ మండలం, హస్నాబాద్ కు చెందిన మోర భాస్కర్ (25) హైదరాబాదులోని అజిజ్ నగర్ లో తన భార్య రేణుక, తమ్ముడు సంజీవులతో కలిసి మేస్త్రి పనులు చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తనతల్లి మోర రాములమ్మకు ఫోన్ చేసి, తాను ఊరికి వస్తున్నట్లు చెప్పి, తన మోటార్ సైకిల్ (టీఎస్06ఎఫ్బీ 6463) పై తన సొంత గ్రామానికి హస్నాబాద్ కు బయలుదేరాడు.
మార్గమధ్యలో హైదరాబాద్-బీజాపూర్ 163 జాతీయ రహదారిపై బొంరాస్ పేట్ పెద్ద చెరువు ప్రక్కన గల బ్రిడ్జిని అతివేగంతో అదుపుతప్పి ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలపాలైన భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై నయీమోద్దీన్ తెలిపారు. మృతుడికి 9 నెలల క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిగి ఆసుపత్రికి తరలించారు. తల్లి రాములమ్మ (49) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నయీమోద్దీన్ తెలిపారు.