చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి..
X

దిశ,తానూర్ : తానూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కరగిరి ఎల్లప్ప (40) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఎల్లప్ప ఇంట్లో నుండి వెళ్ళి పంట చేనిలో ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని తెలిపారు. భార్య కారిగిరి లక్ష్మిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు . ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed