పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

by Dishafeatures2 |
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
X

దిశ, చేర్యాల: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. చేర్యాల హెడ్ కానిస్టేబుల్ మాటురి కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆకునూరు గ్రామానికి చెందిన బోయిని శేఖర్ (32) అనే రైతు.. ఈ నెల 15వ తేదీన మండలంలోని చుంచనకోట గ్రామంలోని అత్తగారి ఇంటికి వెళ్ళి అదే రోజున తిరిగి ఇంటికి వచ్చాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన శేఖర్.. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగానని చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో పడి ఉన్న శేఖర్ ను 108 వాహనంలో చేర్యాల ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం అతడిని సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న శేఖర్ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శేఖర్ తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు. కాగా మృతునికి భార్య బోయిని కావ్య 5 నెలల ప్రెగ్నెన్సీ తో ఉండగా చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Next Story

Most Viewed