పుట్టినరోజునే మృత్యు ఒడిలోకి నాలుగేళ్ల బాలుడు

by GSrikanth |   (  Updated:2022-10-21 08:05:30  IST  )

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారి కిందపడి నాలుగేళ్ల బాలుడి తలకు బలమైన గాయం కావడం

పుట్టినరోజునే మృత్యు ఒడిలోకి నాలుగేళ్ల బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారి కిందపడి నాలుగేళ్ల బాలుడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, పుట్టినరోజునే నాలుగేళ్ల బాలుడికి చివరి రోజు కావడం గమనార్హం. భవన యజమాని నిర్లక్ష్యం మూలగానే బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద బంధువులు ధర్నా చేస్తున్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story