బాణాసంచా స్టాల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

by Disha Web Desk 2 |
బాణాసంచా స్టాల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ‌లోని గాంధీనగర్‌ జింఖానా మైదానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా స్టాల్స్‌లో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బాణాసంచ స్టాళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం



Next Story

Most Viewed