పంట పొలంలో యువకుడి మృతదేహం లభ్యం

by Dishafeatures2 |
పంట పొలంలో యువకుడి మృతదేహం లభ్యం
X

దిశ, కాజులూరు: కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో ఓ యువకుని మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉంది. కె.గంగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన కాటే కళ్యాణ్ గా స్థానికులు గుర్తించారు. కళ్యాణ్ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎర్రపోతవరం గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళతో కళ్యాణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కళ్యాణ్ మృత దేహం కాల్వ గట్టున చాలా సేపు పడి ఉన్నా పోలీసులు ప్రెస్ కు ఆలస్యంగా సమాచారం చెప్పడంతో విమర్సలకు తావిస్తోంది.

Next Story

Most Viewed