దారుణం.. కత్తితో పొడిచి, బండతో కొట్టి ప్రియురాలి హత్య (వీడియో)

by Disha Web Desk 9 |
దారుణం.. కత్తితో పొడిచి, బండతో కొట్టి ప్రియురాలి హత్య (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియురాలిని, ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి రోహిణిలో చోటుచేసుకుంది. రోహిణిలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాహిల్‌(20) అనే వ్యక్తితో సాక్షి(16)కి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సాహిల్, సాక్షిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. కత్తితో పలుమార్లు పొడిచిన అనంతరం, పక్కనే ఉన్న పెద్ద బండతో సాక్షి ని కొట్టి చంపాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ భయంకరమైన హత్యను స్థానికులు చూస్తున్నా ఆపడానికి ఎవరు ముందుకు రాలేదు.

అంతదారుణ హత్య జరుగుతున్నా చూస్తూ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అయితే, సాక్షి తన ఫ్రెండ్ కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్తుండగా సాహిల్ ఆమెపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సాహిల్‌పై షాబాద్ డైరీ పోలీస్ స్టేషన్లో ఐపీసీ u/s 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న సాహిల్‌ను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలపాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.



Next Story

Most Viewed