గొలుసులతో కట్టేసి అత్యాచారం.. పూర్ణానంద స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల బాలిక..!

by Disha Web Desk 19 |
గొలుసులతో కట్టేసి అత్యాచారం.. పూర్ణానంద స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల బాలిక..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తల్లిదండ్రులను కోల్పోయిన బాలికను కుటుంబ సభ్యులు ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమాన్ని నిర్వహించే స్వామీజీ తండ్రిస్థానంలో ఉండి అండగా నిలవాల్సింది పోయి కామాంధుడిగా మారాడు. రోజులు కాదు నెలలు కాదు ఏకంగా రెండేళ్లుగా బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. గదిలో కాళ్లకు గొలుసులు కట్టి మరీ దారుణంగా కోరిక తీర్చుకునేవాడు. అంతేకాదు తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని భయంతో ఆమెను కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా బయటకు పంపేవాడు కాదు.

స్నానం చేసేందుకు బయట ఉన్న బాత్ రూమ్‌కి కూడా పంపించకుండా నాలుగు గోడల మధ్య నిర్బంధించి అవసరం వచ్చినప్పుడల్లా కోరిక తీర్చుకునేవాడు. చివరికి ఆ నరక కూపం నుంచి బాలిక బయటపడి పోలీసులకు తెలియజేయడంతో సదరు స్వామీజీ గుట్టు రట్టు అయ్యింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ అమానుష ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరానికి ఓ బాలిక (15) చిన్నతనంలోనే తల్లిండ్రులను కోల్పోయింది.

దీంతో బంధువులు ఆమెను కొంత వరకు చదివించారు. అయితే బాలికను పోషించడం ఇబ్బందికరంగా మారడంతో విశాఖపట్నంలోని కొత్త వెంకోజి పాలెం వద్ద ఉన్న జ్ఞాననంద అనే ఆశ్రమానికి పంపించారు. ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ ఆ అమ్మాయిని ఆశ్రమంలో చేర్చుకున్నాడు. మెుదట కొన్ని రోజులు ఆవులకు మేత వేయడం, పేడ తీయడం లాంటి పనులు చేయిపించేవాడు. ఆ తర్వాత బాలికపై పూర్ణానంద కన్ను పడింది. బాలికను అనుభవించాలనుకున్నాడు. తన గదిలో నిర్బంధించి అత్యాచారం చేశాడు.

రెండేళ్లుగా నరకం

వెంకోజి పాలెం వద్ద ఉన్న ఆశ్రమంలో స్వామీజీకి గది ఉంది. ఆ గదిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. గదిలో బాలిక కాళ్లకు గొలుసులు కట్టి నిర్బంధించి కృరంగా ప్రవర్తించేవాడు. వద్దు అని అడ్డు చెప్తే తీవ్రంగా దాడి చేసేవాడు. తిండి పెట్టకుండా నరకం చూపించేవాడు. కేవలం రెండే రెండు చెంచాలతో అన్నాన్ని మాత్రమే నీటితో కలిపి పెట్టేవాడు. అక్కడితో ఆగిపోలేదు.. బాలికను కాలకృత్యాలకు బయటకు వెళ్లకుండా చూసేవాడు.

ఒక బకెట్ ఇచ్చి అందులోనే కాలకృత్యాలు తీర్చుకోవాలని ఆదేశిస్తూ పైశాచిక ఆనంద పొందేవాడు. రెండు వారాలకొకసారి ఆమెను స్నానం చేసేందుకు అనుమతి ఇచ్చేవాడు. ఇలారోజులు కాదు నెలలు కాదు ఏకంగా రెండేళ్లుగా అభం శుభం తెలియని బాలికకు నిత్యం నరకం చూపించాడు. అయితే ఇటీవల జూన్ 13న ఓ పనిమనిషి సహాయంతో ఆ బాలిక ఆ నరక కూపం నుంచి తప్పించుకుని బయటపడింది. తనకు తెలిసిన మహిళకు బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి విలపించింది.

పోక్సో కేసు నమోదు

చిన్నవయసులోనే ఏ ఆడపిల్ల పడని కష్టాలు అనుభవించిన ఆ బాలికను కృష్ణా జిల్లాలోని కంకిపాడులో ఉన్న హాస్టల్లో చేర్చేందుకు తెలిసిన మహిళ ప్రయత్నించింది. అయితే అందుకు హాస్టల్ నిర్వాకులు మాత్రం అంగీకరించలేదు. కొన్ని కండీషన్లు పెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలని ఆదేశించారు. దీంతో సదరు మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు లెటర్ ఇచ్చారు. అనంతరం ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీకి తీసుకెళ్లింది. ఆమె అనుభవించిన నరకాన్ని అక్కడ ఉన్నవారికి ఆ బాలిక తెలియజేసింది.

అనంతరం సీడబ్య్లూసీ సభ్యులు విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు. సోమవారం అర్థరాత్రి పోలీసులు పూర్ణానంద స్వామీజీని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. మైనర్ బాలికను తాను అత్యాచారం చేయలేదని పూర్ణానంద స్వామీజీ వివరణ ఇచ్చారు. కొంత మంది ఆశ్రమ భూములు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా కుట్ర చేసి తనను ఈ కేసులో ఇరికించారు అని పూర్నానంద స్వామీజీ తెలిపారు.

Also Read.

భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని భార్య సూసైడ్.. ప్రతి రోజు 50 ఐ లవ్ యూ మెసేజ్‌లు.. చివరకు!

Next Story

Most Viewed