జార్ఖండ్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 12 మంది మృతి

by Disha Web Desk 12 |
జార్ఖండ్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 12 మంది మృతి చెందినట్లు జార్ఖండ్ అధికారి ఒకరు తెలిపారు. ఈదురు గాలులు, వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు ఆయా జిల్లాల క్షతగాత్రులను ధృవీకరించాలని కోరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ తాజాగా మరోసారి.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.



Next Story

Most Viewed