కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లల మృతి

by Nallavelli.Anjaneyulu |

కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో చోటుచేసుకుంది.

కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లల మృతి
X

దిశ, హాలియా : కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం ఆవుల సైదులు అనే రైతుకు చెందిన గొర్లు ఇంటి ఆవరణలోనే ఉండగా.. సమీపంలో ఉన్న కుక్కలు గొర్రెల దొడ్డిలోకి జొరబడి పలు గోర్లపై దాడి చేశాయి. ఈ దాడిలో 12 గొర్లు అక్కడికక్కడే మృతిచెందగా.. పలుగొర్లు తీవ్ర గాయాల పాలయ్యాయి. గాయాల పాలైన గొర్రెల‌కు చికిత్స అందించేందుకు అధికారులకు సమాచారం ఇచ్చారు. గొర్ల మృతితో రైతుకు సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Next Story