మరో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది ప్రయాణికులు దుర్మరణం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-30 12:33:44  IST  )

మరో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది ప్రయాణికులు దుర్మరణం

మరో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది ప్రయాణికులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం శివగంగై పరిధిలోని సమత్తోపురంలో రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం(11 People Dead) చెందారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story