దారుణం.. మంత్రాలు చేస్తుండని కత్తితో పొడిచిన్రు

by Vadlamudi Anukaran |

<p>దిశ, నిర్మల్: నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం గ్రామంలో సత్తయ్య అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో అదే గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్ కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిర్మల్ లోని గ్రామీణ పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఉపేందర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి.. గ్రామస్తుల [&hellip;]</p>

దారుణం.. మంత్రాలు చేస్తుండని కత్తితో పొడిచిన్రు
X

దిశ, నిర్మల్: నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం గ్రామంలో సత్తయ్య అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో అదే గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్ కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిర్మల్ లోని గ్రామీణ పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఉపేందర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి.. గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story